ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

 అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు.. మనవార్తలు ప్రతినిధి,రామచంద్రాపురం: ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి   మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని […]

Continue Reading

ఉత్సాహంగా రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)పై అవగాహన కలిగించేందుకు క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ నాలుగో ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నాడు ఉదయం నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమంలో ఎస్‌ఎంఏ బాధిత కుటుంబాలు, వైద్య నిపుణులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, రన్నర్లు, పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.ఈ రన్ కు ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ […]

Continue Reading

కార్మికుల సంక్షేమం భద్రత,చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సిఐటియు తోనే సాధ్యం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయించిన చరిత్ర సిఐటియు దే కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు కోసం ఐక్యంగా ఉద్యమించాలి జైల్ భరో ను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి కిర్బి కార్మికుల అభినందన సభ భారీ ర్యాలీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్మికుల సంక్షేమం, భద్రత, చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సిఐటియు తోనే సాధ్యమని, కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు కోసం ఐక్యంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు […]

Continue Reading

ఇంటర్మీడియెట్ విద్యార్థులకు గీతం అవగాహన

అధ్యాపకుల పర్యవేక్షణలో గణిత, విజ్జాన శాస్త్రాల బోధన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ముత్తంగిలోని MJPTBCWRJC, Sangareddy, and SOE Girls కళాశాలలోని ఇంటర్మీడియెట్ విద్యార్థుల కోసం గణిత, విజ్జాన శాస్త్ర అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ డ్, ఈఏపీసెట్ పరీక్షలకు సమర్థవంతమైన సన్నద్ధత వ్యూహాలను విద్యార్థులకు అందించడంతో పాటు, ఇంజనీరింగ్, గణితం, విజ్జాన శాస్త్రంలో ఉన్నత విద్యను […]

Continue Reading

మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన తనిష్క్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  టాటా గ్రూప్‌కు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ తనిష్క్, దక్షిణ భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి ‘మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. వరమహాలక్ష్మి పండుగను పురస్కరించుకుని విడుదల చేసిన ఈ కలెక్షన్‌కు నటి రుక్మిణి వసంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దక్షిణ భారత మహిళల జీవితంలో మల్లెపూలకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. మల్లెపూల మొగ్గలు, వికసించిన పువ్వులు, పూలదండల […]

Continue Reading

మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ – మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ విజేతగా సిప్రా మల్లిక్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్‌కు చెందిన సిప్రా మల్లిక్, ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 సీజన్-4 నేషనల్ ఫైనల్స్ లో ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్‌గావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన వివాహిత మహిళలు పాలుపంచుకున్నారు.ఈ పోటీల్లో సిప్రా మల్లిక్ తన ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్పష్టమైన భావవ్యక్తీకరణ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మేధస్సు, మాట్లాడే తీరు వంటి […]

Continue Reading

భానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

క్షిపణి సాంకేతికపై ప్రత్యక్ష అవగాహన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐడీఎస్) విభాగాల విద్యార్థులు, భారతదేశంలోని ప్రముఖ రక్షణ ఉత్పాదక సంస్థలలో ఒకటైన భానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)ను సందర్శించి, భారతదేశపు అధునాతన క్షిపణి సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహనతో పాటు విలువైన పారిశ్రామిక అనుభవాన్ని పొందారు.ఈ పర్యటన సందర్భంగా, విద్యార్థులు ఆధునిక క్షిపణి సాంకేతికతలపై ఒక విజ్జానదాయక సదస్సులో […]

Continue Reading

మరోసారి పరమత సహనాన్ని చాటుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

రూ.25 లక్షల సొంత నిధులతో చోటి మసీదు భవన నిర్మాణానికి అండ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పరమత సహనం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంజి రోడ్డు లో గల చోటి మసీదు ప్రార్థన స్థలానికి చెందిన స్థలంలో 25 లక్షల రూపాయల సొంత నిధులతో భవనాన్ని నిర్మించి మసీదు నిర్వాహకులకు అందించారు. ఈ మేరకు శుక్రవారం మత పెద్దల […]

Continue Reading

పటాన్‌చెరు టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యం అధ్యక్షులుగా బాదిని శ్రీనివాస్ – ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ సత్యం ఎన్నిక పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటమే మార్గం: ఎల్గోయి ప్రభాకర్, సీలంకోటి సురేందర్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) పటాన్‌చెరు డివిజన్ 3వ కాన్ఫరెన్స్ పటాన్‌చెరు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బాదిని శ్రీనివాస్, […]

Continue Reading

టీడబ్ల్యూజెఎఫ్ సహాయ కార్యదర్శిగా బక్కోల్ల రాము నియామకం

-పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ గురువారం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఐబీ అతిథి గృహంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో నేటి దినపత్రిక సూర్య పటాన్ చెరు,రిపోర్టర్ బక్కోల్ల రాముకు సహాయ కార్యదర్శిగా అవకాశం దక్కింది.ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీలో నన్ను […]

Continue Reading