స్వచ్ఛ హరిత సమాజాన్ని నిర్మిద్దాం కృష్ణవేణి పాఠశాల కరస్పండేంట్ నాగరాజు అచ్చి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భవిష్యత్ తరాలకు స్వచ్ఛ హరిత సమాజాన్ని నిర్మిద్దామని కృష్ణవేణి పాఠశాల కరస్పండేంట్ నాగరాజు అచ్చి అన్నారు.గ్రీన్ డే పురస్కరించుకొని మంగళవారం పటాన్ చెరు పట్టణం లోని సీతారామపురం కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ నాగరాజు అచ్చి ఆధ్వర్యంలో గ్రీన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పాఠశాల ప్రాంగణాన్ని ఆకుపచ్చ రంగులతో బెలూన్లు, మొక్కలు, పర్యావరణ సందేశాలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు […]

Continue Reading

అంగరంగ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రానున్న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో వేడుకలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే సంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్, తదితర కార్యక్రమాలు […]

Continue Reading

ఈనెల 10న జరిగే “జైల్ భరో” కార్యక్రమాన్ని కార్మిక వర్గం విజయవంతం చేయాలి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ దేశవ్యాప్తంగా ఆగస్టు 10న నిర్వహిస్తున్న “జైల్ భరో” కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్టోళ్ళ పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో శాండ్విక్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కార్మికుల ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కేంద్ర […]

Continue Reading

పేదరికం, సామాజిక వివక్షలే మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అజైలియు నియుమై మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పేదరికం, నిరుద్యోగం, లింగ అసమానత, సామాజిక వివక్షలను మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా హైదరాబాదు విశ్వవిద్యాలయం, సోషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అజైలియు నియుమై అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో మానవ అక్రమ రవాణాపై అంతర్ విభాగ పరిశోధన ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళవారం […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించండి  ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో పరిశ్రమల భాగ్యస్వామ్యం మరింత పెరగాలి బాల వికాస ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభం అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధిజిన్నారం : ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మినీ ఇండియా గా పేరొందిన […]

Continue Reading