అంగరంగ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

రానున్న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో వేడుకలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే సంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే ప్రతి పాఠశాలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతి తో పాటు, ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన పాఠశాలలకు 20 వేలు, 15 వేలు, 10 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర ఘట్టాలను, సంస్కృతిని మరిపించేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *