22A నిషేధిత భూముల బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ పోరాటం

కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు అవిశ్రాంత పోరాటం నిరసన గళం సభను విజయవంతం చేయండి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూముల బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పటాన్‌చెరు కేంద్రంగా నిర్వహించనున్న నిరసన గళం సభను దిగ్విజయవంతం చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. 22A భూముల సమస్యపై బాధితుల పక్షాన నిలిచి, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం […]

Continue Reading

జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ ను ప్రారంభించిన సినీ నటి సుమ కనకాల

మనవార్తలు ప్రతినిధి,జడ్చర్ల : గరుడ వస్త్ర సిల్క్స్ తెలంగాణలో తమ తొలి బ్రాంచ్‌ను జడ్చర్లలోని నేతాజీ రోడ్డులో ప్రముఖ సినీ నటి సుమ కనకాల ప్రారంభించారు .అనంతరం సుమ కనకాల మాట్లాడుతూ జక్క శమంతకమణి, జక్క మనీషా, జక్క శ్రేయ మరియు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన గరుడ వస్త్ర సిల్క్స్, వినియోగదారులకు అత్యుత్తమమైన మరియు ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో సంప్రదాయ మరియు ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లను విస్తృతంగా అందిస్తోందని ఆమె అన్నారు జడ్చర్ల […]

Continue Reading

శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : శ్రావణ మాసం సందర్బంగా శుక్రవారం రోజు చందానగర్, గౌతమి నగర్ వేముకుంట లో గల శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయం లో లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 300 మహిళలు అమ్మవారి లలితా సహస్రనామ.కుంకుమార్చనలో పాల్గొన్నారు, మరియు రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళా సోదరీమణులు పూజకు వచ్చిన వారికి సోదర భావంతో అందరికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం సుమారు 1000 […]

Continue Reading

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్ బిజినెస్ గ్రోత్ (సీబీజీ), రెండవ అంతర్జాతీయ వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజం సదస్సు (బీఐఎస్ఎస్-2026)ను డిసెంబర్ 10-11, 2026 తేదీలలో నిర్వహించనుంది.‘మానవ-యంత్ర అనుసంధానం ద్వారా వ్యాపార శ్రేష్ఠత: మానవ అంతర్దృష్టి, యంత్ర మేధస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సదస్సు, వ్యాపారంలో మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాన్ని అన్వేషించడానికి ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, […]

Continue Reading

ఏఐ-ఆధారిత చర్మ క్యాన్సర్ నిర్ధారణపై పరిశోధనకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లోని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని శ్రీలక్ష్మి చెరుకూరి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డెర్మోస్కోపిక్ ఇమేజ్ విశ్లేషణను ఉపయోగించి చర్మ క్యాన్సర్ గుర్తింపు కోసం ఆప్టిమైజ్ ఎన్సెంబుల్ డీప్ లెర్నింగ్ మోడల్స్ రూపకల్పన, అభివృద్ధి’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ […]

Continue Reading

ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలి

అమీన్పూర్‌లో విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్‌ డివిజన్ పరిధిలోని మాధవపురి హిల్స్, పిజెఆర్ ఎంక్లేవ్ కాలనీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం విగ్రహ ప్రతిష్టాపన, చక్రపురి కాలనీలో శ్రీశ్రీశ్రీ ముద్గల ఈశ్వర ఆలయంలో శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ […]

Continue Reading

భూదాన్ భూముల సమగ్ర సర్వే చేసి కబ్జాకోరుల భరతం పట్టండి–సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్రంలో భూదాన భూములు కాపాడుటకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి భూములను ఆక్రమించి అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాకోరుల భరతం పట్టాలని,చట్టపరంగా కఠినంగా శిక్షించాలని సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ అన్నారు .సంగారెడ్డి జిల్లా సర్వోదయ మండల్ జిల్లా సమావేశం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉప్పరి రవీందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సర్వోదయ మండల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ శంకర్ […]

Continue Reading

స్మార్ట్ ఫోన్ సైబర్ సెక్యూరిటీపై పరిశోధనకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లోని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి కోక విజయ్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాలేషన్ అనంతర సైబర్ దాడులను గుర్తించి, వాటి ప్రభావాన్ని తగ్గించే అనుకూల వ్యవస్థ’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. కిరీట్ […]

Continue Reading

ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి ప్రతిభ

రెండు స్వర్ణ పతకాలు సాధించిన పాటిబండ్ల నవనీత్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు 17 నుంచి 23, 2026 వరకు నిర్వహించిన తొలి ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు.ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలో నవనీత్ తన ప్రతిభ, నైపుణ్యం, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. టీమ్ ఈవెంట్‌లో ఒక స్వర్ణ పతకంతో పాటు, వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించి […]

Continue Reading

ఆర్బీఐ కేంద్ర బోర్డులో అనధికార డైరెక్టర్ గా సయ్యద్ అక్బరుద్దీన్ నియామకం

హర్షం వెలిబుచ్చిన గీతం యాజమాన్యం, సంతోషాన్ని వ్యక్తపరిచిన కౌటిల్యా అధ్యాపకులు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్, ఐక్యరాజ్య సమితిలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డులో పార్ట్-టైమ్, అనధికారిక డైరెక్టర్ గా నియమితులయ్యారు. నాలుగేళ్ల కాల పరిమతి గల ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి..భారత ప్రభుత్వానికి క్యాబినెట్ నియామకాల కమిటీ సచివాలయం, సిబ్బంది, […]

Continue Reading