గీతంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం 2026ను ఘనంగా నిర్వహించింది. తమ సంస్థలోని అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేసింది.ప్రముఖ భారతీయ తత్వవేత్త, రాజనీతిజ్జుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు పుష్పాంజలి ఘటించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యారంగానికి, ప్రజా జీవితానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేసి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల అమూల్యమైన సేవలను ఈ వేడుక గౌరవించింది. ఈ కార్యక్రమం అధ్యాపక బృందానికి వారి దినచర్య నుంచి విరామం తీసుకుని, ప్రశంసలు, సంగీతం, నవ్వులు, మరపురాని క్షణాలతో నిండిన ఒక రోజును ఆస్వాదించే అవకాశాన్ని కల్పించింది.ఉపాధ్యాయ వర్గం అందించిన జ్జానం, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, స్ఫూర్తి పట్ల తమ ప్రశంసలను వ్యక్తం చేస్తూ, విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపక బృందం కృతజ్జతా భావంతో పలు ఆసక్తికరమైన ప్రదర్శనల ద్వారా ఈ వేడుకలలో చురుకుగా పాల్గొన్నారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులను శాలువాలు, జ్జాపికలు, నగదు పురస్కారాలతో యాజమాన్యం సత్కరించింది.యువ మేధస్సులను తీర్చిదిద్దడంలో, ప్రతిరోజూ విద్యార్థుల జీవితాలలో అర్థవంతమైన మార్పును తీసుకురావడంలో వారి అచంచలమైన నిబద్ధతను గుర్తిస్తూ, గీతం యొక్క అంకితభావం గల అధ్యాపక బృందానికి ఈ వేడుక ఒక హృదయపూర్వక నివాళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *