తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలకంతా శుభం కలగాలి_నీలం మధు ముదిరాజ్

politics Telangana

చిట్కుల్ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్న నీలం మధు..

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్న నీలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విశ్వ వసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం చిట్కుల్ గ్రామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఉగాది పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణులను తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయమన్నారు. భారతీయ సంస్కృతిలో జ్యోతిషశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం మాత్రమే కాకుండా భవిష్యత్తును అంచనా వేసే విధంగా పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారన్నారు. విశ్వవసు నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని పంచాంగ శ్రవణం లో పండితులు వివరించారని తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతూ ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *