కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలి

politics Telangana

కేంద్ర ప్రభుత్వం కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తారా

సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్

పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ కాఫీల దగ్ధం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తాయని కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ కాపీలను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ వచ్చిందని అన్నారు 2019లో నుండి లేబర్ కోడ్స్ తెచ్చేందుకు ప్రయత్నం చేసిన కార్మిక వర్గ పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. బిహార్ ఎన్నికల తర్వాత లేబర్ కోడ్స్ అమలు వేగవంతం చేసిందని,బెంగాల్ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాగానే లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ చేసి అమలులోకి తెచ్చిందని ఆరోపించారు. లేబర్ కోడ్స్ తో 8 గంటల పని 12:00 గంటలకు జరుగుతుందని తీవ్ర పనిభారం కార్మిక వర్గం మీద పడుతుందని అన్నారు. పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కుల పై తీవ్ర దాడి జరుగుతుందని తెలిపారు. లేబర్ కోడ్స్ కావని యాజమాన్యాల ప్రయోజనాల కోడ్స్ అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు అయ్యేవరకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రాజు, నాయకులు వెంకటేష్, చంద్రయ్య, శ్రీనివాస్, ప్రభు, దుర్గయ్య, అన్నాజీ, వెంకటేశ్వరరావు, యాదయ్య, ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *