సారు మాకు న్యాయం చేయండి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజా చైతన్య గ్రామీణ సాంకేతికత అభివృద్ధి మండలి(capart) పథకం ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వందమంది బాధితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డివిజన్ ఇంచార్జ్ రాధాకృష్ణ పంతులు ఆధ్వర్యంలో బాధితులు తహసీల్దార్ హరిబాబుని కలిసి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ భాస్కరరావు కాపార్ట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసిందని తెలిపారు. అయితే అప్పట్లో కొంతమంది నిర్మించుకొని పన్నులు చెల్లిస్తున్నారని, మరి కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇల్లు నిర్మించుకోలేకపోయామని వాపోయారు. ప్రస్తుతం అందులో ఇల్లు నిర్మించుకునేలా రెవెన్యూ అధికారులు ఎన్వోసీ జారీచేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేలా చూసి ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సత్తెయ్య, చాంద్ పాషా, లింగయ్య, అనసూజ, లక్ష్మమ్మ, లక్ష్మి, శ్యామల, సులోచన, రాజమణి, నాగేశ్వరరావు, ఎండీ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *