ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి అని, ఉద్యోగం చేస్తున్నామన్నడం కంటే ఆ ఉద్యోగంలో సఫలికృతుల మయ్యమనేదే ముఖ్యమని శశికళ యాదవ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు మండలంలోని ముత్తంగి డివిజన్ లో గల పి ఎస్ ఆర్ గార్డెన్ లో గ్రామీణ నీటిపారుదల శాఖ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మిషన్ భగీరథ గ్రామీణ నీటి సరఫరా ( ఆర్ బ్ల్యూఎస్ ) డిప్యూటీ ఇంజనీర్( డిఈ) ఇంగు శ్రీనివాస్ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్ఈ రఘువీరా ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూసంగారెడ్డి జిల్లా లోని వివిధ ప్రాంతాలతో పాటు పటాన్ చెరు నియోజక వర్గ పరిధిలో నిర్వీరామంగా 1997 నుండి 2026 వరకు గ్రామీణ నీటి సరఫరా ( ఆర్ బ్ల్యూఎస్ ) శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్ నుండి డిప్యూటీ ఇంజనీర్ గా పదోన్నతులు పొంది మనసున్న అధికారిగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ అనేది చేయాల్సిందేనని కానీ పదవి విరమణ అనేది ఉద్యోగానికే తప్ప మనసుకు కాదని, మరో కొత్త జీవితంలోకి అడుగీడుతున్నట్లు భావించాలన్నారు. సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ జిల్లా ఎస్ఈ రఘువీరా మాట్లాడుతూ మిషన్ భగీరథ ( గ్రామీణ త్రాగునీటి సరఫరా) విభాగంలో గత 36 సంవత్సరాలుగా అంకితభావంతో వివిధ విభాగాలలో పదోన్నతులు పొందుతూ ఆ పదవికే వన్నెతెచ్చారని కొనియాడారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం మొదలుకొని డిప్యూటీ ఇంజనీర్ గా ఒక మచ్చలేని ఉద్యోగిగా పదవి విరమణ పొందుతుండడం అభినందనీయమని ఆయురారోగ్యాలతో మీ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ఎస్ఈ రాజయ్య,ఈఈ లు పాషా, సంపత్, విజయలక్ష్మి, నాగభూషణం, డిప్యూటీ ఈఈ లు హరీష్, పాణి, రిటైర్డ్ ఈఈ లు రామకృష్ణ, రామ్మోహన్,సబ్ డివిజన్ల పలు విభాగాల ఉద్యోగులు, సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *