జాతిపితకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్కులో గల గాంధీ మహాత్ముడి కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు చూపిన మార్గం, అనుసరించిన విలువలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాయకంగా నిలుస్తాయని అన్నారు. నేటికీ ప్రపంచంలోని ప్రతి దేశంలో గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *