మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్రం లో గ్రామాల అభివృద్ధ్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నాడని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు .రుద్రారం గ్రామంలో పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 20,21, 22 తేదీలలో రుద్రారం గ్రామ నూతన బొడ్డురాయి ప్రతిష్ట చేయాలని అని గ్రామసభ మరియు గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు .ఈ దైవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని అలాగే గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీలో త్రాగునీటి సమస్యలపై పరిష్కారం చేస్తానని అని అనంతరం గ్రామసభను గ్రామ పెద్దలు మరియు ప్రజల సమక్షంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో. గ్రామ ప్రజలకు వివిధ కులవృత్తి దారులకు, వివిధ వ్యాపారస్తులకు ,సంబంధించిన బ్యాంకు లోన్లు ఇస్తామని సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధ్దికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాణి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు మన్నె రాజు హరి ప్రసాద్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఎంపిటిసి కే రామ్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు