మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా ఆయన ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రామిక శక్తి ఆవార్డు గ్రహీత రాష్ట్ర ఐఎన్ టి యుసి నాయకులు మరియు టిపిసిసి లేబర్ సెల్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, టిపిసిసి లేబర్ సెల్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరమల్ల వీరేందర్ గౌడ్,, శ్రామిక శక్తి అవార్డు గ్రహీత”టిపిసిసి లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఏ- బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉయ్యూరు శ్రీదేవి, శ్రామిక శక్తి అవార్డు గ్రహీత” టీపీసీసీ లేబర్ సెల్ శేరిలింగంపల్లి నియోజక వర్గం అధ్యక్షులు మాదిరెడ్డి మోహన్ రెడ్డి, టిపిసిసి లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దంగుల తిరుపతి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. మోసిన్ పటేల్, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కుమార్ సాగర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
