పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి – మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ట్టి విగ్ర‌హాలు ఎంతో మేలు చేస్తాయ‌ని ప‌టాన్ చెరు మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణంలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేశారు . మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్‌, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన అవ‌సం ఉంద‌న్నారు . ముఖ్యంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్ల్లుతోందని … ఇలాంటి పరిస్థితుల్లో మట్టి గణపతులను పూజించడం ద్వారా భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినట్లవుతుందని మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .

మ‌రోవైపు మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ తో ఏర్పాటు చేయబడ్డ సాధన సమితి ఆధ్వ‌ర్యంలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు . పర్యావరణ పరిరక్షకోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో మెట్రో సాధన కోసం ప్రతీ ఒక్కరం కృషి చేయాల‌ని విగ్రహాల సంఖ్య పెరిగినట్టుగానే ప్రజల్లో ఐక్యమత్యం పెరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్, పాపరాజు, మహెష్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *