మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
పటాన్చెరు పారిశ్రామిక వాడకు చెందిన యువ బాక్సర్ బచ్చు హేమంత్ ముదిరాజ్ బాక్సింగ్లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 5న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50–55 కిలోల బరువు విభాగంలో బచ్చు హేమంత్ ముదిరాజ్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.ఈ విజయంతో బచ్చు హేమంత్ ముదిరాజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరగనున్న నేషనల్ సౌత్ జోన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.హేమంత్ ముదిరాజ్ ఈ విజయానికి ఆయన కోచ్ గిరి బాబు అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో దోహదపడింది. కోచ్ గిరి బాబు ఆధ్వర్యంలో కఠోర శిక్షణ పొందుతూ హేమంత్ ఈ స్థాయికి చేరుకున్నాడు.బచ్చు హేమంత్ ముదిరాజ్ స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, పారిశ్రామిక వాడ ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, పటాన్చెరుకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.
