జిన్నారం,మనవార్తలు ప్రతినిధి :
జిన్నారం మండలం రాళ్లకత్వ తన సొంత నిధులతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చిట్కులు సర్పంచ్ నీలం మధు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే మొట్టమొదటి అని అన్నారు .దాంతో పాటు నిర్మించిన సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం నామకరణం చేయడం గొప్ప విషయం అన్నారు.అంబేద్కర్ అందరివాడు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చాటి చెప్పారన్నారు .కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని , ఎంతకాలం బ్రతికామన్నది కాదని ప్రజలతో ఆదరణ పొందే విధంగా ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని ఆయన తెలిపారన్నారు. అంబేద్కర్ ను ఉన్నతంగా నిలిపి, సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఒక గొప్ప మహా వ్యక్తిగా నిలిచిపోతారని ఆయన తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం నుంచి రాళ్లకత్వ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాయిని రమమల్లేష్, ఉప సర్పంచ్ గణేష్, ముత్తాంగి మాజీ పిఎసిఎస్ చైర్మెన్ నారాయణ రెడ్డి, వెంకటేష్,మెట్టు కృష్ణ యాదవ్,అన్వర్ పటేల్, ఎకె ఖాన్,శ్రీనివాస్, మాణిక్యం, గారెల మల్లేష్,గోపాల్,శంకర్,మహేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, అంబేద్కర్ సంఘం నాయకులు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.