మనవార్తలు ప్రతినిధి, రామచంద్రాపురం :
అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ వివరాలు నమోదు చేయించుకునేలా మరింత అవగాహన కల్పించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భారతీ నగర్, రామచంద్రపురం డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని అన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అద్భుతంగా పనిచేస్తున్నప్పటికిని.. నమోదు శాతం ఆశించినంతగా లేదని తెలిపారు. ప్రక్రియ ముగియడానికి ఐదు రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్ఐఆర్ లో పాల్గొనని ఓటర్లను స్వయంగా కలుసుకొని వివరాలు అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఓటు అత్యంత కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, పృథ్వీరాజ్, ఐలేష్, ప్రమోద్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
