పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : దివంగత రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల ఆయన కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి వినమ్ర నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, అజ్మత్, రుద్రారం శంకర్, రాజు, ఇమ్రాన్, కొండల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
