యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు

– బీకే ఎంక్లేవ్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అండ్ బిగ్ టీవీ సహకారం మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ ,మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకేఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్ ,బీకే ఎంక్లేవ్ కాలనీ లో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ […]

Continue Reading

రైతాంగాన్ని నట్టేట ముంచిన దగాకోరు కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచినా రైతాంగానికి చేసింది శూన్యమని, నమ్మి ఓటేసిన రైతులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పౌర […]

Continue Reading

కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26వేలకు పెంచాలి

ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత ఎక్కడ..? 72 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ఊసేది సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ. 26వేలకు పెంచాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయ బద్ధంగా లేదని, 72 షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల ఊసే లేదని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ […]

Continue Reading

అభివృద్ధిలో ఆదర్శంగా ఇంద్రేశం మున్సిపాలిటీ పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీనీ అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరంబండ, ఐనోలు, ఇంద్రేశం, బచుగూడెం వార్డులలో 15 కోట్ల రూపాయల అంచనా చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ఉదయం స్థానిక మున్సిపల్ పాలకవర్గం తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలలో […]

Continue Reading

గీతంలో వినూత్న మార్గదర్శన కార్యక్రమం

విద్యార్థుల సాధికారతే లక్ష్యంగా ప్రారంభించిన టీఎంసీజీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : అర్థవంతమైన మార్గదర్శనం, సలహాల ద్వారా విద్యార్థులకు సాధికారత కల్పించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఒక వినూత్న విద్యార్థి మార్గదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గీతం వృత్తిపరమైన సలహాల కేంద్రంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సలహాలు (టీఎంసీజీ) డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ దీనికోసం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు తమ విద్య, వృత్తి, వ్యక్తిగత […]

Continue Reading

క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతన చర్చి ప్రారంభం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నియోజకవర్గంలోని క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతనంగా నిర్మించిన చర్చిని శుక్రవారం ఎంఎల్ఏ జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో చర్చిల నిర్మాణాలు దోహదపడతాయని తెలిపారు. ఏసుక్రీస్తు […]

Continue Reading

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వివిధ కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కాలనీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ […]

Continue Reading

గణేష్ గడ్డ దేవాలయానికి ప్రత్యేక ర్యాంపు 

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జాతీయ రహదారి విస్తరణ అధికారులతో సమీక్ష మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం లో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక గణపతి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ర్యాంపు, మెట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం జాతీయ రహదారి విస్తరణ శాఖ […]

Continue Reading

ఓఆర్ఆర్ లోపలి రైతుల భూములను వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : ఓఆర్ఆర్ లోపలి రైతుల భూములను వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. ఇవాళ ఈ రోజు లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి, నష్టపోతున్న పేద రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ జోనింగ్ […]

Continue Reading

కొండాపూర్ డివిజన్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తరణ

– నూతన అధ్యక్షునిగా మహమ్మద్ జాంగిర్ నియామకం మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లినియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్‌లో బుధవారం రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ నూతన అధ్యక్షునిగా మహమ్మద్ జాంగిర్‌ను నియమిస్తూ ఆర్డర్ కాపీ అందజేశారు.కార్యక్రమంలో ఆఫీస్‌పేట్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీలు […]

Continue Reading