పటేల్ గూడ గ్రామపంచాయతీ ని సందర్శించిన జెడ్పి చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి

Districts politics Telangana

మనవార్తలు ,అమీన్పూర్

అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో ఆదివారం ప్రారంభించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి సోమవారం సందర్శించారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, సర్పంచ్ నితీషా శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *