ఇంటింటి ప్రచారంలో ముదిరాజ్ యువజన సమాఖ్య ఈటెల గెలుపుకై శ్రమిస్తున్న దారం యువరాజ్ ముదిరాజ్

Hyderabad Telangana

మనవార్తలు_శేరిలింగంపల్లి:

హుజూరబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గెలుపు కొరకు ఇంటింటికి తిరుగుతూ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ నియోజకవర్గాని చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం చూసి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుండి చక్కటి ఆధారణ లభిస్తుందని తెలిపారు. 33 జిల్లాల నుంచి భారీ ఎత్తున ముదిరాజ్ యువకులు ప్రచారంలో పాల్గొన్నారు .ఈటెల గెలుపు కై కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ముదిరాజ్ యువజన తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యువరాజ్ ముదిరాజ్ అన్నారు.

 

శేరిలింగంపల్లి,హుజూరబాద్,ఈటెల రాజేందర్,దారం యువరాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *