విజేత సూపర్ మార్కెట్ నూతన శాఖ ప్రారంభం

Hyderabad politics Telangana

మానవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ మరియు గోదావరి కట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, ప్రముఖ వ్యాపార వేత్త మాగంటి రూప, విజేత సూపర్ మార్కెట్ చైర్మన్ అండ్ ఎం డి జగన్ మోహన్ రావు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హాజరై ప్రారంభించారు.

వినియోగదారుల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతున్న విజేత సూపర్ మార్కెట్ ముందు ముందు మరిన్ని శాఖలను ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయాలని పలువురు నేతలు కోరారు.మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకున్న మార్కెట్ పేరులోనే ఉన్న విజేత సూపర్ మార్కెట్ అందుకు తగ్గట్టే ఇతర షాప్ ల పోటీని తట్టుకుంటు తనదైన ముద్ర వేసుకుందని కొనియాడారు. ఎం డి జగన్మోహన్ రావు అంకితభావం వల్లే ఎంతోమందికి ఉపధికల్పించడంతో పాటు కల్తీ లేని వస్తువులు ప్రజలకు అందుతున్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, తెరాస నాయకులు చాంద్ పాషా, రమేష్, బలరాం యాదవ్,తిరుపతి, వెంకటేశ్వర్లు, బాబ్జి ,నరేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *