పటాన్చెరు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి, మైత్రి మైదానం, ఎంపీడీవో, ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్ద నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిఎస్పి భీమ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పట్టణ పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.