హైదరాబాద్
భారత ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఉపాధ్యక్షుడు (డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్) గా ఉన్న ఈయనను భారత వాయుసేన కొత్త చీఫ్ గా నియమించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. వెంకటరామ్ చౌదరి 29 డిసెంబర్ 1982 న ఎయిర్ ఫోర్స్ యుద్ధ విభాగంలో చేరారు. ఎయిర్ ఫోర్స్ లో ఈయనకు వివిధ రకాల ఫైటర్ మరియు ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లను నడిపిన అనుభవం ఉంది.
ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఈనెల 30 న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన నుంచి చౌదరి కొత్త చీఫ్ గా బాధ్యతలు చేపడతారు. వివేక్ రామ్ చౌదరి ఈ ఏడాది జూలై 1 న వైమానిక సిబ్బంది డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. వైమానిక దళానికి వైస్ చీఫ్గా నియమించబడటానికి ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (డబ్ల్యూఏసీ) కమాండర్-ఇన్-చీఫ్గా పనిచేశారు.వివేక్ రామ్ చౌదరి బి హెచ్ ఈ ఎల్ , హైదరాబాద్ ప్రాంత నివాసులు. హై్యర్ సెకండరీ స్కూల్ లో విద్యను అభ్యసించారు. తండ్రి బి హెచ్ ఈ ఎల్ ఎంప్లాయ్ గా రిటైర్ అయ్యారు, తల్లి స్కూలు టీచరు గా పని చేశారు.