గీతం పాలక మండలిలో చేరిన ముగ్గురు ప్రముఖులు…

Districts politics Telangana

– తపోవర్ధన్ , ఎమ్మార్కే ప్రసాద్ , రాజేంద్రప్రసాద్ ను స్వాగతించిన గీతం అధ్యక్షుడు

పటాన్ చెరు:

గీతం పాలక మండలి సభ్యులుగా మరో ముగ్గురు ప్రముఖులు చేరారు . ఆర్వీ ఎంటర్ప్రైజైస్ మేనేజింగ్ పార్టనర్ వాసిరెడ్డి తపోవర్ధన్ , ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎమ్మార్కే ప్రసాదరావు , సీసీఎల్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్లను పాలక మండలిలోకి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు . గీతం తన లక్ష్యాలను సాధించడంలో వారి మార్గనిర్దేశనం ఉపకరించగలదని ఆయన ఆశాభావం . వెలిబుచ్చారు , వారి అనుభవం , దార్శనికత గీతను గొప్ప సంపదగా ఆయన అభిప్రాయపడ్డారు . ముగ్గురు ప్రముఖుల గురించి క్లుప్తంగా విశాఖలోని అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ పూర్వ వ్యవస్థాపకుడు , కార్యదర్శిగా సేవలందించిన తపోవర్ధన్ ఓ ఉద్వేగభరితమైన విద్యావేత్త , రెండు దశాబ్దాలుగా అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం , నిర్వహణలతో పాటు దాతృత్వంలో కూడా పేరొందారు .

రహదారులు , వంతెనలు , భవన నిర్మాణంలో నాలుగు దశాబ్దాల విశేష అనుభవం గల ఎమ్మార్కే ప్రసాద్ , అయా ప్రభుత్వాలు తమ మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాధించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు . బహుళ ప్రాజెక్టుల నిర్వహణ , వాటిని సకాలంలో పూర్తిచేయడంలో పేరొందారు . నియత్నాం , స్విట్జర్లాండ్ తో పాటు మనదేశంలో కూడా కర్మాగారాలున్న బహుళ జాతి కంపెనీకి నాయకత్వం వహిస్తున్న చల్లా రాజేంద్రప్రసాద్ , దాతృత్వంతోపాటు ఆధ్యాత్మికతలో కూడా తన నిబద్ధతను చాటుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *