బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిశోరం షాహిద్ “భగత్ సింగ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నా దేహం కన్నా దేశం గొప్పది’ అని నినదించిన త్యాగశీలి షాహిద్ “భగత్ సింగ్ శ్రీబాలాజీ ఫౌండేషన్ చైర్మన్ ,బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు “బలరాం అన్నారు . భగత్‌ సింగ్‌ 117వ జయంతి సందర్భంగారామచంద్రపురం లోని 112” డివిజన్ సాయి నగర్ కాలనీలో షాహిద్ “భగత్ సింగ్” గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిశోరం,భరతమాత స్వేచ్ఛ కోసం ఉరికంబాన్ని ఆనందంగా ముద్దాడిన వీరతేజం,ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భారతీయుల గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన సింహనినాదం,“నన్ను చంపగలరు కానీ నా ఆలోచనలను చంపలేరు” అంటూ ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని పుట్టించిన విప్లవ కెరటం షహీద్ భగత్ సింగ్ అని తెలిపారు. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంతోష్ గారు, యాదగిరి గారు, మల్లేష్ గారు, ప్రవీణ్ గారు, కుమార్గారు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *