విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంగా గత వారపు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు శనివారం సాయంత్రం ఘనంగా మూసాయి. అనంతరం విజేతలకు పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి క్రీడోత్సవాలకు పటాన్చెరు వేదిక చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ మాట్లాడుతూ..కోకో, వాలీబాల్, కబడ్డీ అంశాల్లో అండర్ 17, అండర్ 14 విభాగాల్లో క్రీడలు నిర్వహించామని తెలిపారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన జట్లను రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గౌసుద్దీన్, వ్యాయామ ఉపాధ్యాయులు షర్ఫుద్దీన్, ఆసిఫ్, కిష్టయ్య, రామరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.