దేవాలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే

Hyderabad politics Telangana

భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు

మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి కి 10 లక్షల రూపాయల విరాళం అందించనున్నట్లు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ యని, దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణ చేయాలని కోరారు.. మొట్టమొదటి భగులాముఖి శక్తిపీఠం మహారాష్ట్రలో ఉందని, రెండవది శివంపేట లో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పురోహితులు ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *