తెలుగు సమాజం ఒక ఉత్తమ విద్యావేత్త, కథారచయిత ను కోల్పోయింది

politics Telangana

  శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : 

ప్రముఖ కథా రచయిత, అధ్యాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మరణించడం తెలుగు సాహిత్యానికి తీరని లోటని. సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షులు దార్ల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పని చేశారని. ఆ సమయంలో బిఏ, ఎంఏ తెలుగు విద్యార్థులకు ఎన్నో ఉత్తమమైన పాఠ్యాంశాలను రూపకల్పన చేశారని తెలిపారు. ఆయన అనేక కథలు రాశారని జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు పేర్లతో కథా సంపుటాలుగా కూడా ఆయన కథలు వెలువడ్డాయి. ఆయన కథలు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. అనేక విశ్వవిద్యాలయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా కొత్త కొత్త పాఠ్యాంశాలు పెట్టారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *