పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రపురం లోని శ్రీనివాస్ నగర్ కాలనీ బాలవిహార్ పార్క్ వద్ద తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత.తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి అని కొనియాడారు. నేటి తరానికి వారి చరిత్రను తెలిపేలా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం చాకలి ఐలమ్మ అసోసియేషన్ పెద్దలు,చాకలి నర్సింహా,చాకలి మల్లేష్,సమయ్య,నర్సింహా,యాదగిరి,ప్రభు,సాయి,శివ తదితరులు. ప్రజలు పాల్గొని ఘననివాళులర్పించారు.