మనవార్తలు ,పటాన్చెరు
సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు. ఆయన పుట్టిన రోజును దేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.