పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద అని గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద ,తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు,ఆ వాగ్దాటి ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానంద కావడం విశేషం. నేటి తరం యువత వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందుకే ఆయన సేవలను స్మరిస్తూ ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకుంటారు అని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారుఈ కార్యక్రమంలో వివేకానంద యుత్ సభ్యులు నవీన్ రెడ్డి ,మధుకర్ రెడ్డి ,సాయి తేజ, పటాన్ చేరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ గారు, ఎంపిటిసి నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు సుంకరి రవీందర్ , తలారీ ఆంజనేయులు ,గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.