సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం….
హైదరాబాద్:
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను అపోలో హాస్పిటల్స్ ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, బ్రాండెడ్ మార్కెట్ సీఈవో ఎం వీ రమణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుత్నిక్ వీ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
భారతదేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్ రెడ్డీస్ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 1,50,000 మందికి వ్యాక్సిన్లను అపోలో హాస్పిటల్ ద్వారా అందించనున్నట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు హరి ప్రసాద్ తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్, అపోలో స్పెక్ర్టా హాస్పిటల్స్, అపోలో క్లీనిక్స్ సహా 60కు పైగా కేంద్రాలలో టీకా కేంద్రాలలో సుత్నిక్ వీ వాక్సినేషన్ వేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి సుత్నిక్ వీ వాక్సినేషన్ చేశారు. సుత్నిక్ వీ వ్యాక్సిన్ 1200 నుంచి 1250 రూపాయలు గా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.