జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్

Districts politics Telangana

_ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి

_టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటో& వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెమినార్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.

ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ పై ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులను ఫోటోగ్రాఫర్లకు అండగా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాపర్తి.శ్రీనివాస్, రాష్ట్ర సంఘము కోశాధికారి మునగాల శైలేందర్, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు శేఖర్ , ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ కుమార్, కోశాధికారి గడ్డం లక్ష్మా రెడ్డి, స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *