హైదరాబాద్:
శ్రావణమాస బోనాల ఉత్సవాలలో బోనం ఎత్తిన శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి. శ్రావణమాస బోనాల ఉత్సవాలు కేశవనగర్, గౌలిదొడ్డిలో బస్తీ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బిజెపి యువమోర్చ రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కోలాహలం, పోతురాజుల నృత్యాలు, డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు బిజెపి రాష్ట్ర నేతలు కసిరెడ్డి భాస్కరరెడ్డి, జ్ఞాణేంద్రప్రసాద్, శ్రీధర్ రావు, బిక్షపతి, మార్ల తిరుపతి, ఈశ్వర్, శ్రీనివాస్, గణేష్, యాదయ్య, భాస్కర్ మరియు బస్తీ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.