మదీనగూడలో ప్రణామ్ హాస్పిటల్స్ పారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ

Hyderabad politics Telangana

మనవార్తలు ప్రతినిధి,శేరిలింగంపల్లి:

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రణామ్ హాస్పిటల్స్ ముందుకు రావడం సంతోషకరమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ అన్నారు .శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలోప్రణామ్ హాస్పిటల్స్ నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవనికి ముఖ్య అతిధిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని పారరంభించారు .అనంతరం మాట్లాడుతూ మదీనాగూడలో నూతన సుమారు 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో మల్టీస్పెషాలిటీ వైద్య సేవలతో పాటు మాతృత్వం, చిన్నారుల వైద్య విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం చాల సంతోషమని తెలిపారు .ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ గారు, ఆసుపత్రి యాజమాన్యులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, నియోజకవర్గ సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు టీం యలమంచి ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *