పోచారంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి జాతర

politics Telangana

దేవాలయాలు ఆధ్యాత్మితకు నిలయాలు

ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ఆధ్యాత్మితకు నిలయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం, జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్, పిఎసిఎస్ చైర్మన్ బిక్షపతి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, సీనియర్ నాయకుడు దశరథ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *