– టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్
– ఎమ్మెల్యే కాలే యాదయ్య
– మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ
– కె.వి.రమణారెడ్డి పదవి విరమణ
మనవార్తలు ,పటాన్ చెరు:
కార్మికుల శ్రేయస్సు కోరే వ్యక్తి రమణారెడ్డి అని టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ లు అన్నారు. శుక్రవారం ఓడిఎఫ్ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కె.వి.రమణారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కె.వి.రమణారెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో సైతం తన వంతు కృషి చేశారని అన్నారు. ఎంతమంది కార్మికుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేశారని గుర్తు చేశారు. పదవి విరమణ పొంది, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని వారు ఆకాంక్షించారు. పదవి విరమణ పొందిన కూడా కార్మికుల సమస్యల పరిష్కారాలకు సలహాలు, సూచనలు సూచించాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కెవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, ఈఎస్ఐ బోర్డ్ మెంబర్ లు మారయ్య, రెబ్బ రామారావు, సంగారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ జెడ్పిటిసి మనోహర్ గౌడ్, టీఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రావు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదగిరి యాదవ్, విజయ్ కుమార్ తో పాటు ఓడిఎఫ్ అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు, టీఆర్ఎస్ కెవి అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.