మనవార్తలు ,పటాన్ చెరు:
జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రశంసించారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించారన్న విషయం తెలుసుకున్న అల్లం నారాయణ మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రెస్ అకాడమీ తరపున జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఎమ్మెల్యేకు తెలిపారు. భవిష్యత్తులోనూ పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.