– అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులు సంబరాలు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
విశ్వ భారతి లా కళాశాలలో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు విద్యార్థులు జరుపుకున్నారు. పటాన్చెరు మండలం ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో శనివారం లా విద్యార్థులు, ప్రిన్సిపల్ భవానీతో పాటు అధ్యాపకుల తో కలిసి నూతన సంవత్సర వేడుకలు లో భాగంగా కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా లా విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… కొత్త సంవత్సరంలో అందరికి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు అంబర్, గురుమూర్తి, వర్ష,రమ్య, కీర్తి ,అన్వి, పూనం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
