మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి లోని పాపి రెడ్డి కాలనీ కి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సాయి నందన్ ముదిరాజ్ ఆద్వర్యంలో సంఘ సభ్యులు శనివారం రోజున గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ను మసీద్ బండ లోని ఆయన కార్యాలయం లో కలసి సంఘంలో ఉన్న సమస్యల గురించి, పాపి రెడ్డి కాలనీ సమస్యల గురించి చర్చించారు. మురికి కాలువలు, వీధిలైట్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ఎవరు పట్టించు కోవడం లేదని, ఎన్నిసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ప్రభుత్వం అధికారుల పని తీరు ఉందని ఆరోపించారు. అధికారులు స్పందించి సత్వరం చర్య తీసుకోవాలని కోరారు. ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి రవి యాదవ్ కు సంఘo తరపున ఎప్పటికీ మద్దతునిస్తూ ముందుకు సాగుతామన్నారు. రవి యాదవ్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని సంఘo అధ్యక్షుడు సాయి నందన్ ముదిరాజ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఎల్లపుడు తోడు నీడగా మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మారబోయిన రవి యాదవ్ అన్నారు . ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, మందల కృష్ణ ముదిరాజ్, గణేష్, అశోక్, శివాజీ, ఉమేష్, దిలీప్, టిల్లు, గోవర్ధన్,వెంకటేష్, చెన్ని, బాలు, రాజు, వినోద్, కార్తీక్, బాలరాజ్ ముదిరాజ్, బబ్లు, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.