పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోని వివిధ చర్చిలకు మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చి ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాల మూలంగా చెక్కుల పంపిణీ ఆలస్యం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి మంజూరైన ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రంగా రావు, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు.