_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తక్షణమే తాహెర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎమ్మెల్యే జిఎంఆర్ సూచనల మేరకు స్వయంగా ప్రవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, మూడు లక్షల రూపాయల వ్యయంతో శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. గురువారం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు.నమ్ముకున్న నాయకుడు తన కష్టాల్లో అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని తాహెర్ తెలిపారు.