నిరుపేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం కోసం స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి ఎం ఆర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో సొంత స్థలం కలిగి ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితులను దళారులను ఆశ్రయించవద్దని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో మాడల్ హౌస్ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో సొంతింటి కలను సహకారం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఐలేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *