గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడి అనంతరం దశాబ్దికాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్పూర్తితో పని చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయం తదితర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, నిధుల కొరత ఉంటే తనను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ ద్వారా నిధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.నియోజకవర్గం కేంద్రమైన పటాన్చెరు లోని వ్యవసాయ మార్కెట్ యార్డును విస్తరిస్తున్నామని, యార్డ్ సమీపంలో గల రైల్వే శాఖకు సంబంధించిన 20 ఎకరాల భూమిని మార్కెట్ యార్డ్ కు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకుజవాబుదారీగా పని చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలో సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :