మనవార్తలు ,పటాన్ చెరు:
నిరుపేదలకు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదిక సమీపంలో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గురువారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన వివిధ సంస్థలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమలు, నిర్మాణ రంగ సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, ఎంపిడిఓ బన్సిలాల్, స్థానిక సర్పంచ్ ఉమావతి గోపాల్, ఎంపీటీసీ నాగ జ్యోతి లక్ష్మణ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, గ్రా