ఏడుపాయల వన దుర్గమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ ఏడుపాయల దుర్గా భవాని దేవాలయాన్ని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్ రెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ సమీపంలో అమీన్పూర్ మండలం వడక్పల్లి గ్రామ సర్పంచ్ లలితా మల్లేష్ అధ్వర్యంలో నిర్మించిన నూతన షెడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, కిష్టారెడ్డిపేట సర్పంచ్ కృష్ణ, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *