రెండు లక్షల 60 వేల రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ కి చెందిన సురేందర్ రావు కుమార్తె కీర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రెండు లక్షల 60 వేల రూపాయల విలువైన ఎల్ఓసి నీ కీర్తి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాణిక్ ప్రభు, శ్రీ రాములు, రాజన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *