లక్డారం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Districts politics Telangana

పటాన్ చెరు

పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో వెలసిన అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *