హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో గల దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విజయోత్సవ ర్యాలీలలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్‌చెరు సీఐ వినాయక్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, రుద్రారం మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకన్న, హనుమాన్ భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *