పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం చిట్కుల్, ఇంద్రేశం గ్రామ పరిధిలోని ఆర్కే కాలనీలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని మతాల ప్రధాన పండుగలను అన్ని వర్గాల ప్రజలు సంతోషాలతో నిర్వహించుకోవాలని లక్ష్యంతో ప్రభుత్వం తరఫున కానుకలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, చిట్కుల్ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంతిరెడ్డి, బండి శంకర్, రామచంద్ర రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.